Massive Congress Joinings in Narsampet
ఎమ్మెల్యే దొంతి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని 25వ వార్డు నుండి పలువురు ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీపీసీసీ సభ్యులు,మాజీ కౌన్సిలర్ పెండెం లక్ష్మిరామానంద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారిలో నల్గొండ సంతోష్,నల్గొండ వంశీ,చీకటి శివమణి,ముద్రబోయిన రాజు,పుట్ట జగదీష్,పుట్ట రామస్వామి,జాటోతు వీరన్న,మురారి వినయ్,స్వామిశెట్టి రాజశేఖర్,చీకటి విజయ్,శ్రీనివాస్ ఉన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మాజీ ఎంపిటిసి కాట ప్రభాకర్,కాట రఘు,మెరుగు కిరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
