నేటిధాత్రి, వరంగల్
ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఓబిసి కేటగిరీలో 13వ ర్యాంక్, జనరల్ కేటగిరీలో 78వ ర్యాంక్ సాధించారు వరంగల్ కి చెందిన విద్యార్థి సాంబారి మణిదీప్ కుమార్. విద్యార్థి మణిదీప్ వాళ్ల నాన్న సాంబారి సంజయ్ కుమార్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఆల్ ఇండియా లెవల్ లో 13వ ర్యాంక్ సాధించిన మణిదీప్ ను తోటి స్నేహితులు, బందువులు అభినందించారు.