అయ్యప్ప దేవాలయంలో మొదలైన మండల పూజలు

# ఆలయ కమిటీ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ గుప్తా

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో త్రివింశతి 23 వా మండల పూజ మహోత్సవ కార్యక్రమాలు గురువారం మొదలైనాయి.డిసెంబర్ 27 వరకు కొనసాగే మండల పూజ మహోత్సవాలు మొదటి రోజు సుప్రభాత సేవతో మొదలు కాగా ఒకార ద్వాజరోహణము,హోమ గుండం ఆవిర్భావం,సుదర్శన హోమం నిర్వహించారు.41 లతో పాటు మండల పూజల్లో చేపట్టే మహా అన్నదాన కార్యక్రమం 41 రోజుల పాటు కొనసాగనున్నదని ఆలయ కమిటీ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ గుప్తా తెలిపారు.17 ,22 , తేదీల్లో పుష్పాభిషేకలు,మహా దిన్య పడిపూజలు,27 కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అలాగే డిసెంబర్ 2,3 తేదీల్లో మహా దిన్య పడిపూజ ఉంటాయని చెప్పారు. అదే నెలలో 8 అయ్యప్ప స్వామికి పల్లీవేట కార్యక్రమం,9 న పంబా అరాట్టు కార్యక్రమం మదన్నపెట చెరువులో జలక్రీడలు నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.18,23,25 తేదీల్లో మహా దివ్య పడిపూజలు ఉంటాయని 29 న పడిపూజతో పాటు సహస్ర కలశములతో ద్వితీయ మహా పుష్కర కుంబాభిషేకం నిర్వహించడం జరుగుతుందని వివరించారు.అలాగే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మహాదివ్య పడిపూజ ,మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.మొదటి రోజు మహా అన్నదాన కార్యక్రమం దాతగా వరంగల్ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సంపత్ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవునూరి అంజయ్య,నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు ఇరుకు కోటేశ్వర్ రావు,జిల్లా కార్యదర్శి గోనెల రవీందర్,కోశాధికారి తక్కల్లపెళ్ళి యుగేందర్ రావు,డివిజన్ కార్యదర్శి శివ కుమార్,కోశాధికారి కోమండ్ల భూపాల్ రావు,హన్మకొండ జిల్లా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యులు ఎస్ వేణుగోపాల్ రెడ్డి జగన్నాథరావు వెంకట నరసింహారావు,ఆలయ కమిటీ బాధ్యులు శ్రీరాం ఈశ్వరయ్య, మాదారాపు చంద్రశేఖరం గుప్తా, ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు గర్నేపల్లి శ్రీనివాస్ బెలిదే కిషన్, శ్రీరాముల శంకరయ్య, చింతల కమలాకర్ రెడ్డి, దొడ్డ రవీందర్ గుప్తా పాలకుర్తి శ్రీనివాస్ చకిలం కృష్ణమూర్తి, వంగెటి గోవర్ధన్, బండారిపల్లి చెంచారావు,చింతల నిరంజన్, భూపతి లక్ష్మీనారాయణ, దొడ్డ వేణు, మల్యాల రాజు, ఆలయ గుమస్త రాము పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!