సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

గొల్లపల్లి నేటి దాత్రి:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామంలో గ్రామంలో శుక్రవారం కొలువుదీరిన త్రీ సమ్మక్క సారలక్క వన దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న గొల్లపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ సృష్టికి మూలం జీవం, జీవానికి మూలం వనం, మన జాతి కోసం పోరాడి వారి ప్రాణాలనే పణంగా పెట్టి ప్రజల యోగక్షేమాలే ఊపిరిగా బ్రతికి ప్రజల కోసమే ప్రాణాలు అర్పించిన మహనీయులను గౌరవించడం మన సాంప్రదాయం. గిరి పుత్రుల నిష్కల్మ ష త్వానికి అసమాన పోరాట పటిమకు ప్రతిబింబం సమ్మక్క సారలమ్మ జాతర అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమ సంతోష్, మాజీ సర్పంచ్ రేవెల్ల సత్యనారాయణ గౌడ్, సరసాని తిరుపతిరెడ్డి, దాసరి తిరుపతి గౌడ్, నేరెళ్ల మహేష్, గుండి బుజ్జులు, కొండ గంగారెడ్డి, అశోక్, వెంకటేష్, తుడము నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!