
Mandakrishna Madiga
24న జహీరాబాద్ కు మందకృష్ణ మాదిగ రాక
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఈ నెల 24న జహీరాబాద్ లో పెన్షన్ పెంపు కోసం నిర్వహించే మహా గర్జన సన్నాహక సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జహీరాబాద్ నియోజకవర్గంలోని వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తప్పక హాజరు కావాలని తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు నర్సింహులు కోరారు.