దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి.

Central Government Central Government

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి )

 

 

ఈనెల మే 20వ తారీఖున జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన సమ్మె నోటీసును వివిధ సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా బిఆర్టియు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా చేసి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ వ్యవస్థకు వత్తసు పలుకుతూ కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో లక్షలాదిమంది ఉపాధి పొందుతున్న వివిధ పరిశ్రమల మీద అనేక ఆంక్షలు.నిబంధనలు పెట్టి కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటు అన్నారు. కార్మిక సంఘాల ఏర్పాటు లేకుండా కార్మికుల హక్కుల కోసం ఎటువంటి సమ్మెలు చేయకుండా ఎనిమిది గంటల పని దినాన్ని తుంగలో తొక్కి చట్టాల సవరణ చేయడం బాధాకరమన్నారు.
కార్మికులకు ఉద్యోగ భద్రత
పని భద్రత మరియు కనీస వేతనాల అమలు లాంటివి లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసేదాకా కార్మికులంతా ఐక్య పోరాటం చేయవలసిన అవసరము ఉందని అన్నారు.
ఈ సమ్మె అంతం కాదని ఆరంభం మాత్రమే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు ఆలంబిస్తే రాబోయే ఎన్నికల్లో కార్మికులు మీకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కడారి రాములు. సిఐటియు నాయకులు
అన్నల్ దాసు గణేష్. ఐఎన్టీయూసీ నాయకురాలు గొట్టే రుక్మిణి. కార్మిక నాయకులు చిట్యాల మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!