BJP’s Vanga Mallikarjun Gains Strong Support in Nadikood
నన్ను గెలిపించండి ఊరికి సేవ చేస్తా
నడికూడ,నేటిధాత్రి:
గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నడికూడ మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వంగ మల్లికార్జున్ కి మద్దతుగా మరియు వార్డ్ మెంబెర్స్ మోత్కూరి లక్ష్మీ రమేష్,వంగ శరణ్య మల్లికార్జున్,కోట తిరుపతి, ఎరుకల రాజారెడ్డి,మందోటి విజయేందర్,చేకిలె జమున రవీందర్ లకు మద్దతుగా గ్రామంలో ఇంటింటికి విస్తృత ప్రచారంలో బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు,56వ డివిజన్ అధ్యక్షులు మహేందర్ పటేల్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ
గ్రామపంచాయతీల అభివృద్ధి కేవలం కేంద్ర నిధుల ద్వారానే సాధ్యమని అందుకే బిజెపి బలపరిచిన అభ్యర్థి వంగ మల్లికార్జున్ బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెంతల జగన్, ఎరుకల శ్రీనివాస్,ఆకుల రాజు,మందుటి మహేందర్, కోట మల్లయ్య,కోట రవి, శంకర్ లింగం,బిక్షపతి,అంజి, ఆకుల నవీన్,ఎల్లస్వామి, గొనె రాకేష్,గొనె రమేష్ తదితరులు పాల్గొన్నారు.
