సిపిఎం పార్టీ జిల్లా శిక్షణ తరగతులను జయప్రదం చేయండి .

సిపిఎం మహాముత్తారం మండల కార్యదర్శి పోలం .చిన్న రాజేందర్.

మహా ముత్తారం నేటి ధాత్రి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో సిపిఎం పార్టీ మహాముత్తారం మండల కార్యదర్శి పోలం చిన రాజేందర్ మాట్లాడుతూ
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14 15 తేదీలలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మహాముత్తారం మండల కేంద్రంలోని శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను రిలీజ్ చేసి జయప్రదం చేయాలని వారు కోరారు
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మహా ముత్తారం మండల కార్యదర్శి పోలం చిన రాజేందర్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అనేక పోరాటాల నిర్వహించామని వారన్నారు రైతులు మహిళలు యువకులు విద్యార్థులు వ్యవసాయ కూలీలు ఆదివాసీల సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తున్నామని భవిష్యత్తులో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటా నిర్వహించేందుకే ఈ జిల్లాలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఈనెల 14, 15 తేదీలలో జరగబోయే రాజకీయ శిక్షణ తరగతులకు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లు వారు తెలియజేశారు జిల్లా ప్రజానికమంతా తమ వంతు ఆర్థిక సహాయంగా విరివిగా విరాళాలు అందించి. భవిష్యత్ తరాలకు ఊతమిచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మానేటి బాపు గుండం సన్నీ హమాలీ సంఘం అధ్యక్షులు గుండపు సమ్మయ్య గుండపు బన్నీ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *