Congress Candidate Bhavani Bhaskar Reddy Promises Model Maheshwaram
మహేశ్వరం రూపురేఖలు మార్పిస్తా..
14 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గుజ్జుల భవాని భాస్కర్ రెడ్డి
జోరుగా ఇంటింట ప్రచారం..విద్యావంతురాలకు స్వాగతం పలికిన ప్రజలు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట రూరల్ మండలం నుండి మహేశ్వరం గ్రామాన్ని నర్సంపేట మున్సిపల్ పరిధిలో ఇటీవల విలీనమైంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంగా ఉన్న మహేశ్వరం రూపురేఖలకు మార్చి మోడల్ మహేశ్వరంగా అభివృద్ధి చేయిస్తానని 14 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విద్యావంతురాలు
గుజ్జుల భవాని భాస్కర్ రెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గుజ్జుల భవాని భాస్కర్ రెడ్డి ఇంటింట ప్రచారం చేపట్టగా అవార్డు ప్రజలు స్వాగతాలు పలికారు. ఈ నేపథ్యంలో వార్డు ప్రజలు ఆమెకు మద్దతు పలుకుతూ ప్రచారంలో పాల్గొన్నారు. సందర్భంగా భవాని మాట్లాడుతూ తమ కుటుంబం రాజకీయ కుటుంబ నేపథ్యంలో వారి సూచనలతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మహేశ్వరం గ్రామంలోని ప్రధాన రహదారులు అంతర్గత రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు చేపట్టి గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధి గుజ్జుల మాధవరెడ్డి పద్మ,మధు,మాధవరెడ్డి,
కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,మహిళలు,వార్డు వాసులు పాల్గొన్నారు.
