మహాశివరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ..

shiva rathri

మహాశివరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

మహాశివరాత్రి ఉత్సవానికి సర్వం సిద్ధం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతన మైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాల యంలో మహాశివరాత్రి ఉత్సవాల కరపత్రాలను సోమవారం దేవాలయ ఆవరణలో దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ప్రధమ రుద్రాభిషేకం ఆరు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అర్చనలు అభిషేక పూజలు రాత్రి 9:30 కు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తామని రాత్రి 12 గంటలకు లింగోద్భావ పూజ అష్టోత్తర శత బిల్వార్చన నీరాజనం మంత్రపుష్పం జరుగుతాయని చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి మార్త సుమన్ కొలగాని శ్రీనివాస్ కోమటి గణేష్ నీల కోమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!