* భద్రాచలం ఒప్పందం ప్రకారం పెరిగిన రేట్లు అమలు చేయాలి*
భద్రాచలం నేటి ధాత్రి
సమ్మెను ప్రారంభించిన సిఐటియు పట్టణ ఇన్చార్జి నాయకులు గడ్డం స్వామి*
అక్టోబర్ 2024 లో జరిగిన జిసిసి సివిల్ సప్లై రేట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన సమ్మెను సిఐటియు పట్టణ ఇంచార్జ్ నాయకులు గడ్డం స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ నాయకులు నకిరికంటి నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై మరియు జీ సి సి హమాలీ కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్ల విషయమై గత మూడు నెలల క్రితం 20 24 అక్టోబర్ 3 న అన్ని కార్మిక సంఘాల సమక్షంలో సివిల్ సప్లై కమిషనర్ మరియు అధికారులు చర్చలు జరిపి పాత రేట్ల కంటే అదనంగా మూడు రూపాయలు దిగుమతి, ఎగుమతి రేట్లు పెంచడం జరిగిందని, పెంచిన రేట్లను 20 24 జనవరి నుండి అమలు చేస్తామని ఏరియల్స్ తో కలిపి చెల్లిస్తామని సివిల్ సప్లై అధికారులు హామీ ఇచ్చారు. కానీ నేటికి ఒప్పందం అమలు కాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మె చేయవలసిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ఒప్పందం జరిగి మూడు నెలలు కావస్తున్న నేటికీ పెరిగిన రేట్లకు సంబంధించిన జీవోను అధికారులు విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు. గతంలో అనేక సందర్భాల్లో ఒప్పందాలు జరిగిన వెంటనే జీవో విడుదల చేసే వారని, కానీ ఒప్పందం జరిగి మూడు నెలల గడుస్తున్న జీవో విడుదల చేయకపోవడం సరైనది కాదని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం హమాలీల రేట్ల పెంపు జీవోను విడుదల చేసి 20 24 జనవరి నుండి ఏరియర్స్ కు బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు ఎస్ అజయ్ కుమార్ ,ఆర్ రాములు, పాల్గొనగా ఈరోజు సమ్మెలో జిసిసి హమాలీలు సుబ్రహ్మణ్యం, ప్రసాదు, శేషు, లోకేష్, రామారావు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.