భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిద్దాం….
సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
పరాయిపాలన నుండి భారతదేశ విముక్తి కోసం యుక్త వయసులోనే ప్రాణాలు త్రుణపాయంగా దేశ విముక్తి కోసం ప్రాణాలను ఇచ్చిన అమరులు సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు , సుఖదేవ్ ల త్యాగాల స్ఫూర్తితో సమ సమాజం కోసం దోపిడీ లేని కులమత రహిత సమాజం కోసం పాటుపడదామని, సమాజాన్ని ముందుకు తీసుకుపోయే యువత ఐక్యం కావాల్సిన అవసరం ఉందని రామకృష్ణాపూర్ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి నక్క వెంకటస్వామి లు అన్నారు. భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, బీ జోన్ రాజీవ్ చౌక్ నుండి సూపర్ బజార్ చౌరస్తా వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరుల స్ఫూర్తితో సమ సమాజం కోసం కృషి చేద్దామని నాయకులకు,యువకులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్, వెంకటస్వామి, వనం సత్యనారాయణ, పౌల్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.