చేర్యాల కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల పట్టణంలో కోర్టు ఆవరణలో నిన్నటి రోజున కాశ్మీర్ లోయలో ఉగ్రవాద ముష్కరుల దాడి నీ ఖండిస్తూ ఈరోజు చేర్యాల కోర్టు జడ్జి కృష్ణ తేజ మరియు కోర్టు సిబ్బంది న్యాయవాదులు సంతాపం తెలియజేశారు

ఆ తర్వాత విధులు బహిష్కరించి న్యాయవాదులు ఉగ్రదాడికి నిరసనగా బైకు ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమం లో దాదాపు 30 మందికి పైగా న్యాయవాదులు పాల్గొన్నారు

సీనియర్ న్యాయవాది భూమి గారి మనోహర్ చేర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరేళ్ల వీర మల్లయ్య తాటికొండ ప్రణీత్ సురేష్ కృష్ణ కాటం సురేందర్ ఆరెల్లి మహేందర్ మెరుగు రమేష్ మోకు రాజిరెడ్డి ఏ సురేందర్ పర్వతం రాములు తదితరులు పాల్గొన్నారు