నూతన రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం చేయాలి
కందుకూరి నరేష్ టిడిపి పరకాల నియోజకవర్గ బాధ్యులు
పరకాల నేటిధాత్రి
రేషన్ కార్డుల అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్ ప్రక్రియ చేసిన తర్వాత కూడా జిల్లా కలెక్టర్లు గాని స్థానిక తహశీల్దార్లు గాని రేషన్ కార్డుల పై క్లారిటీ ఇవ్వకపోవడం దురదృష్టకరమని గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఫోన్లు చేసి,కొత్త రేషన్ కార్డుకు అప్లికేషన్ చేసుకున్న వారికి సమాచారం ఇస్తూ,మీకు ఇదివరకు మీ తల్లిదండ్రులతో కార్డు ఉందా ఉంటే మీరు అందులో నుండి మీ పేరును డిలీట్ చేసుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డు ఎంట్రీ అవుతుంది చెప్పడం జరుగుతుందని ఏ అధికారి కూడా సరైన వివరణ ఇవ్వడం లేదన్నారు.దీనిపై పూర్తి సమీక్ష సమావేశం నిర్వహించి కలెక్టర్ తో లేదా పౌరసరపరల శాఖ మంత్రితో చర్చించి దీనికి ఒక సులభమైన మార్గాన్ని తీసుకురావాలని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కోరారు.