చలివేంద్ర ప్రారంభించిన కుంకుమేశ్వర స్వామి.!

Cold water Cold water

చలివేంద్ర ప్రారంభించిన కుంకుమేశ్వర స్వామి మాజీ చైర్మన్ గంద వెంకటేశ్వర్లు

ప్రయాణికులకు చల్లని నీరు అందించెందుకే చలివేంద్రం ఏర్పాటు

పరకాల నేటిధాత్రి:

పట్టణంలోని స్థానిక బస్టాండ్ లో కుంకుమేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు,సంజయ్ మెడికల్స్ యజమాని నాగబండి సంజయ్,గంగా వాటర్ ప్లాంట్ యజమాని ఇమ్మడి లక్ష్మణ్ లు చలివేంద్రం(కూల్ వాటర్) కేంద్రాన్ని ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్టాండ్ లోకి చుట్టుపక్కల మండలాల ప్రజలు నిత్యం విద్య వ్యాపార అవసరాల నిమిత్తం కోసం రవాణా చేస్తుంటారు.అందులో భాగంగా వేసవికాలం దృష్ట్యా ప్రజల దహర్తి తీర్చడానికి మా వంతు సహాయంగా చలివేంద్రం ఏర్పాటు చేశామని,ఎండాకాలం మార్చి మాసం మండుటెండల్లో ప్రజల దాహార్తిని తీర్చే సదుద్దేశంతో తమ వంతు సహాయం అందించే దిశగా బస్టాండ్ ఆవరణలో ప్రయాణీకులకు ప్రజలందరికీ చల్లని నీళ్లను అందించాలనే ఉద్దేశంతో మార్చి మాసం నుండి మే ఎండాకాలం పూర్తయ్యే వరకు చలివేంద్రమును నిర్వహిస్తామని తెలిపారు.మానవసేవయే మాధవ సేవగా భావించి ఈ చలివేంద్రమును ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎంతో సంతోషంగా ఉందని ప్రజల సహాయ సహకారాలతో దేవుని అనుగ్రహంతో రాబోయే కాలంలో మరింత ప్రజాసేవ చేయడానికి కృత నిశ్చయంతో కృషి చేస్తామని శ్రీ కుంకుమశ్వరా స్వామి దేవాలయ మాజీ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల బస్ డిపో ఎస్ టీ ఐ.కృష్ణకుమారి, బస్టాండ్ ఇన్చార్జి సురేందర్, డిపో కంట్రోలర్ రమేష్,సిఆర్సి.తిరుపతి,

Cold water
Cold water

విలేజి బస్సు ఆఫీసర్ సదానందం,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!