బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోరెం గ్రామంలో కొండ పోచమ్మ దేవాలయం వద్ద రోడ్డుకు భూమి చేసిన స్థానిక ఎంపిటిసి డబ్బు మమత-సుజన్ రెడ్డి.కోరెం గ్రామంలో కొండ పోచమ్మ దేవాలయంకు వెళ్లేందుకు రోడ్డు అధ్వానంగా మారడంతో, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి, ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యే రవిశంకర్ కి దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే 8లక్షల రూపాయలను సీసీ రోడ్డు మంజూరు చేశారు.
మండల పరిషత్ నిధుల నుండి రెండు లక్షల రూపాయలు కల్వర్టు నిర్మాణానికి మంజూరయ్యాయి.
రహదారికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపిటిసి డబ్బు మమత సుజన్ రెడ్డి, సెక్రటరీ రవి, ఉప సర్పంచ్ గాజర్ల సర్పంచ్ రోహిణి కిరణ్, గ్రామ కో ఆప్షన్ సభ్యులు ప్రభాకర్ రావు,కొమ్ముల ఆనంద రెడ్డి, నాగభూషణ్, తదితరులు ఉన్నారు.
కోరెం కొండ పోచమ్మ రోడ్డు- కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ
