కాంగ్రెస్ గూటికి సింగిల్ విండో డైరెక్టర్ కొంకటి మల్లన్న

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు

ముత్తారం :- నేటి ధాత్రి

కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్ కొంకటి మల్లన్న మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాటారం లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగల్ విండో డైరెక్టర్లు గుజ్జ గోపాలరావు, ఏలువాక కొమురయ్య, నాయుని పార్వతి, కాంగ్రెస్ పార్టీలో చేరగా కొంకటి మల్లయ్య చేరికతో సింగిల్ విండో చైర్మన్ కు అవిశ్వాస గండం పొంచి ఉన్నట్లే కనిపిస్తుంది. గత వారం రోజులుగా మండలంలో సింగిల్ విండో చైర్మన్ అవిశ్వాసం పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతుండగా, ఒక్క డైరెక్టర్ తక్కువ ఉండడంతో అవిశ్వాసానికి ఆలస్యం కావడంతో మాజీ జడ్పీటీసీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ చాకచక్యంగా వ్యవహరించి డైరెక్టర్ ను కాంగ్రెస్ పార్టీలో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో చేర్పించగా అవిశ్వాసానికి త్వరలోనే తెరపడనుంది. ఈ చేరికలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సీఎల్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, మాజీ డైరెక్టర్ చిందం సదానందం తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!