“క్రీడలకు ఖేలో ఇండియా బలమైన తోడు”

*క్రీడల అభివృద్ధి కోసం ఖేలో ఇండియా అమలవుతోంది..

*క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు చేయూతనిస్తోంది..

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వెల్లడి..

*ఖేలో ఇండియా‌ పథకం ముఖ్య ఉద్దేశం, దాని వివరాలను కోరిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు..

*సానుకూలంగా స్పందించిన కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ.

చిత్తూరు(నేటి ధాత్రి)

 

క్రీడల అభివృద్ధి కోసం
ఖేలొ ఇండియా పథకం భారతదేశంలో విజయవంతంగా అమలవుతోందనీ చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు వెల్లడించారు. ఇది క్రీడలను ప్రోత్సహించడానికి, క్రీడాకారులకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడిందని ఆయన తెలిపారు.
న్యూఢిల్లీలో శీతాకాల పార్లమెంటు సమావేశాలు విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ సమావేశాలకు
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
హాజరయ్యా
రు,ఆంధ్రప్రదేశ్ ప్రగతితో పాటు,తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు అభివృద్ధికి సంబంధించి, అంశాలను లోక్ సభ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా కోరారు.
దీనికి భారత ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి, లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు సోమవారం మీడియాకు తెలిపారు.
తాజాగా ఖేలో ఇండియా పథకం ముఖ్య ఉద్దేశాన్ని, దేశ వ్యాప్తంగా ఒక రాష్ట్రం ఒక ఆట చొరవ కింద రాష్ట్రాలకు భారత ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహాయాన్ని అందించిందా..అలాగే కోచింగ్, క్రీడా పరికరాలు,సహాయక సిబ్బంది వంటి సాఫ్ట్ కాంపోనెంట్స్ల మంజూరు కోసం విడుదల చేసిన నిధులకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా కోరగా ఇందుకు తక్షణమే స్పందించిన కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ,సంబంధిత డేటాను సవివరంగా తెలియపరుస్తూ తనకు అందించినట్లు
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
తెలిపారు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..,
అంతేకాకుండా
ఆ పథకం అమలు వల్ల ఆంధ్రప్రదేశ్ కు, చిత్తూరు పార్లమెంటుకు వనగూడిన ప్రయోజనాలను తెలియాలని కేంద్ర యువజనుల వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖను కోరానని, దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ,ఖేలో ఇండియా పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేయడమే కాకుండా
తాను కోరిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు చెప్పారు.
నైపుణ్యమున్న
క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు ఖేలో ఇండియా బాటలు వేస్తోందని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కృతజ్ఞతలు తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version