Grand Celebrations Mark KCR’s Birthday in Nallabelli
ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.
#రాదన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కారణజన్ముడు కేసీఆర్ .
# 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం.
# రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ విధ్వంసం.
నల్లబెల్లి , నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను మంగళవారం మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి ఉత్సాహభరిత వాతావరణంలో భారీ బాణాసంచా పేల్చి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్ది స్వప్న మాట్లాడుతూ.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వయంపాలన లక్ష్యంగా ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన దూరదృష్టి గల నాయకుడు కేసీఆర్ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
అనంతరం పెద్ద చెరువు సమీపంలో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ , సర్పంచులు నాగేల్లి జ్యోతి ప్రకాష్,, పులి రమేష్, మచ్చిక రవి, ఉపసర్పంచ్ గుమ్మడి వేణు, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, క్లస్టర్ ఇన్చార్జులు గందె శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, మామిళ్ళ మోహన్ రెడ్డి, సట్ల శ్రీనివాస్ గౌడ్,మండల సర్పంచుల ఫోరం మాజీ చైర్మన్ నాన బోయిన రాజారాం యాదవ్ మాజీ సర్పంచులు గుండాల కుమార స్వామి, గన్నె బోయిన చేరాలు, ఊరటి అమరేందర్, గోనెల పద్మ నరహరి, మాజీ ఎంపీటీసీ లు జన్ను జయరావు , వైనాల వీరస్వామి, పోడేటి ప్రకాశం, పాలెపు రవీందర్ రావు, అభివృద్ది కమిటీ చైర్మన్ నాగేల్లి శ్రీనివాస్, మద్ది మేడారం మాజీ చైర్మన్ చిట్యాల సీతారాం రెడ్డి, బోట్ల పవన్, పాండవుల రాంబాబు, వార్డు సభ్యులు నాగేల్లి అనిల్, కనకం నవీన్, మాజీ ఉప సర్పంచ్ దాసరి నాగేశ్వర్ రావు, గుండాల శ్రీశైలం, పోతునూరి సుభాష్, బూస సదయ్య, వేల్పుల రవి, మైల గాని సురేష్, గోల్య, సురేందర్, పుట్ట రవి, చందర్, రాజు యూత్ నాయకులు మేడిపల్లి రాజు, సద్దాం, మధు, రెడ్డి ప్రశాంత్, గుండాల సుమన్, పెండ్యాల మహేందర్, కొత్తపల్లి రామ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
