చేర్యాల నేటిధాత్రి
విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవానుడి పుత్రులు ఆవుసుల కులానికి చెందిన కాసుల వంశస్థులు తమ ఆత్మీయ సమ్మేళనాన్ని చేర్యాలలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వారు చేర్యాల లో 600 సంవత్సరాల పైబడి మన పూర్వికులు ఉన్నట్టు వారి స్వస్థలం చింత చెట్టు బావి వద్ద సమాధులు ఉన్నాయని వాటిని శుద్ధి చేసి వాటిపై పూలుచల్లి వారిని స్మరించుకున్నారు ఈ సందర్భంగా సమ్మేళనం నిర్వహించుకున్నారు వారు మాట్లాడుతూ కాసుల వంశస్తులమైన మనం చేర్యాల నుండి సుదీర్ఘ జీవనం చేసిన మేము ప్రతి సంవత్సరం వచ్చి స్మరించుకుంటామని అన్నారు ఇక్కడే నివసిస్తున్న కాసుల వంశస్థులు వాటిని పరిరక్షిస్తూన వారి సేవలను గుర్తించారు ఈ కార్యక్రమంలో కాసుల రమేష్ కాసుల కుమార్ వెంకటేష్ కాసుల సిద్ధేశ్వర్ జగదీశ్వర్ కాసుల వెంకటేష్ ఆంజనేయులు కాసుల రవీందర్ లక్ష్మణ్ కాసుల కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు