`ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో మాజీ ‘‘మున్సిపల్ చైర్మన్’’ నిర్వాకం.
`ఆక్రమించుడు…అమ్ముకునుడు!
`నాయకుడు రియల్ వ్యాపారి అవతారమెత్తాడు.
`అడిగే నాధుడు లేకుండా అన్ని సంతకాలు పెట్టే కుర్చీలో కూర్చున్నాడు.
`కనిపించిన భూములన్ని మింగేశాడు.
`ప్రభుత్వ భూములపై కన్నేయాలే..వెంచర్లు చేసి అమ్మేయాలే!
`వందల కోట్లు తెచ్చిపెట్టిన అక్రమ ఆదాయం.
`ఆ మున్సిపాలిటీలో ఆ లీడర్ ఆడిరది ఆట..పాడిరది పాట.
`గత ప్రభుత్వ పెద్దల అండదండలో ఆక్రమించుకున్న భూములకు లెక్కే లేదు.
`ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మార్చి, వెంచర్ వేసిన ఘనుడు.
పేద దళితులకు 2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కోట్ల రూపాయల మొరం కొల్లగొట్టిన నాయకుడు.
దళితులకిచ్చిన భూమిని బొందల గడ్డ చేసిండు
దళితులకిచ్చిన భూమిలోకి వెల్లాల్సిన రోడ్డును మాయం చేసి వెంచర్ లో కలిపేసిండు.
`ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా భూములను చుట్టేసిండు.
హైదరాబాద్,నేటిధాత్రి:
భూ మాయ అంటే ఇది. ఓ మున్సిపల్ మాజీ చైర్మన్ నిర్వాకమది. కనిపించిన భూములపై కన్నేయడం, వాటిని కమ్మేయడం కొంత మంది అక్రమ రియల్ వ్యాపారులకు భూ దందాతో నేర్చుకున్న విద్య. అదే రియల్ వ్యాపారులు రాజకీయ నాయకులైతే, అధికార పార్టీ అండదండలు పుష్కలంగా వుంటే, అదే వ్యాపారి ఏకంగా ప్రజా ప్రతినిధి అయితే ఎలా వుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడా అదే జరిగింది. ఆ ప్రజా ప్రతినిధి తన పరిధిలో వున్న ప్రభుత్వ భూములను గుర్తించడం, ఆ పక్కనే వున్న ప్రైవేటు భూములను అడ్డికి పావుసేరుకు కొనేయడం, రెండూ కలిపి వెంచర్లు చేయడం మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మున్సిపల్ చైర్మన్ రియల్ దందా దండిగా చేశాడు. కనిపించిన భూములపై కన్నేశాడు. కొనేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆక్రమించుడు…అమ్ముకునుడు! మొదలుపెట్టిండు. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రజా ప్రతినిధికి అండగా పార్టీ పెద్దలు అండగా నిలిచారు. సహకరించారు. పైగా గత పాలకుల కులం కూడా కలివచ్చింది. వేలు విడిచిన చుట్టరికం తోడైంది. ఇక అడ్డే ముంది. ఆగేదే ముంది. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకున్నాడు. పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల విలువైన భూములకు సున్నం పెట్టేశాడు. ఆ మున్సిపల్ పరిధిలో కొంత భూమి కొనుగోలు చేశాడు. ఆ పక్కనే గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా వున్న సమయంలో దళితులకు స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలానికి వెళ్లడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొవ్వ వుంది. ఆ తొవ్వను ఆక్రమించుకున్నాడు. సదరు చైర్మన్ కొనుగోలు చేసిన స్థలానికి సమీపంలో ప్రభుత్వ పార్కు స్థలం వుంది. ఏ రియల్ వ్యాపారి అయిన వెంచర్ చేసే సమయంలో కచ్చితంగా కాలనీకి అవసరమైన పార్క్ ఏర్పాటు చేయడం తప్పని సరి. ఆ మున్సిపల్ పరిధిలో చైర్మన్ ఏర్పాటు చేసిన వెంచర్ కు ప్రభుత్వ పార్కు స్థలం కూడా కలిసి వచ్చింది. ఆ మున్సిపల్ మాజీ చైర్మన్ చేసిన వెంచర్ లో పార్కును ఏర్పాటు చేయలేదు. పైగా ప్రభుత్వ పార్కును తన వెంచర్ కు కలిపేసుకొని అదే పార్కుగా వ్యాపారం చేసి ప్లాట్లు అమ్మేసుకున్నాడు. అలా కూడా ప్రభుత్వాన్ని నిండా ముంచేశాడు. నాయకుడు రియల్ వ్యాపారి అవతారమెత్తడంతో అడిగే వారు లేకుండా పోయారు. ఏదైనా కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చినా ఆ చైర్మన్ కే ఇవ్వాలి. ఒకవేళ అధికారులకు పిర్యాదు చేసినా అది చైర్మన్ టేబుల్ పైకి చేరాలి. ఇంకేముంది ఆ చైర్మన్ది ఆడిరది ఆట పాడిరది పాట అయ్యింది. అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక్కడ మరో ఘనకార్యం కూడా వుంది. దళితులకు గతంలో ఇచ్చిన ప్రభుత్వ భూమి వుండడం కూడా వెంచర్కు కలిసొచ్చింది. ఆ వెంచర్కు అవసరమైన మొరం ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ ఖర్చు కూడా మిగిలిపోయింది. వెంచర్ కోసం అవసరమైన మొరం మొత్తం పక్కనే వున్న దళితుల భూమి నుంచి తరిలించాడు. అలా సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన మొరం తవ్వుకుపోయాడు. దళితుల భూమిని బొందల గడ్డ చేశాడు. పెద్ద ఎత్తున తీసిన గుంతలు వర్షం పడితే చెరువులను తలపిస్తున్నాయి. అంటే ఎంత పెద్ద గుంతలు తీశాడో అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క గుంత చిన్నపాటి చెరువులా తాడి చెట్టు లోతున మొరం తవ్వించాడు. వర్షాకాలంలో అటు వైపు ఈత రాని వాళ్లు పడితే ప్రాణాలతో బతికే అవకాశం కూడా వుండదు. ఇక ఆ భూమిలో దళితులు సాగు చేసుకోలేరు. ఇండ్లు కట్టుకోలేరు. ఆ గుంతలను పూడ్చుకోవాలంటే ఆ దళితులకు కోట్ల రూపాయలు కావాలి. సదరు చైర్మన్ ఆ దళితులు తమ భూమి వద్దకు వెళ్లడానికి ఓ దారి వుండేది. ఆ దారిని చైర్మన్ మాయం చేసి వెంచర్ లో కలిపేసుకున్నాడు. దళితులకు దారి లేకుండా చేశాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసి, బిల్డింగ్లు కట్టుకున్న వాళ్లంతా అగ్ర కులాలకు చెందిన వాళ్లు. అగ్ర కులాల కుటుంబాలున్న ఇండ్ల ముందు నుంచి దళితులు వెళ్తారా? అని వారిని బెదిరించినట్లు కూడా సమాచారం. అడిగే నాధుడు లేకుండా అన్ని సంతకాలు పెట్టే కుర్చీలో కూర్చున్నాడు. కనిపించిన భూములన్ని మింగేశాడు. వందల కోట్లు తెచ్చిపెట్టిన అక్రమ వ్యాపారంతో కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకున్నాడు. గత ప్రభుత్వ పెద్దల అండదండలో ఆక్రమించుకున్న భూములకు లెక్కే లేదనే మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. దళితులకిచ్చిన భూమిని బొందల గడ్డ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం లేకుండా దళితులకు అన్యాయం చేసిండు. ఏకంగా రోడ్డును మాయం చేసి వెంచర్ లో కలిపడమంటే తనకు ఎదురులేదు తిరుగులేదనుకున్నాడు. మళ్ళీ వాళ్ల పార్టీయే అధికారంలోకి వస్తుందన్న ఆశలతో ఈ ఒక్క చోటే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వెంచర్లు అనేకం చేశాడు. వాటిపై త్వరలో వరుస కధనాలు నేటిధాత్రి లో వస్తాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అంతటా భూములను చుట్టేసిండని ఈ చైర్మన్ పేరు మారుమ్రోగిపోయింది. చైర్మన్ అక్రమాలను చాలా మంది అడ్డుకునే ప్రయత్నం చేసినా అధికారులు సహకరించలేదు. ప్రజల మాట వినిపించుకోలేదు. పైగా అన్ని రకాలుగా చైర్మన్ ను సహకరించారు.