Phule Jayanti Celebrated at Narsampet Depot
నర్సంపేట డిపోలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
నర్సంపేట, నేటిధాత్రి:
మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. డిపో మేనేజర్ కె. ప్రసూనలక్ష్మి ఆధ్వర్యంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నర్సంపేట డిపో కమిటీ ఈ సంబరాలను నిర్వహించింది.ఈ సందర్భంగా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కందికొండ మోహన్, డిపో కార్యదర్శి బొడిగె రాజు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. జ్యోతిరావు పూలే సమాజానికి అందించిన సేవలను వారు స్మరించుకున్నారు. సమానత్వం, విద్యా విస్తరణ, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎస్టీఐ అప్ప కుమార్, ఎమ్ఎఫ్ దత్తం, మానస, హెడ్ గార్డ్ విరారెడ్డి, దేవేందర్, రాంబాబు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
