బిఆర్ఎస్ మహిళ కన్వీనర్గా జ్యోతి
పరకాల,నేటిధాత్రి
పట్టణానికి చెందిన బిఆర్ఎస్ మహిళ నాయకురాలు జ్యోతిని పట్టణ బిఆర్ఎస్ మహిళ కన్వీనర్గా నియమిస్తున్నట్లు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు.పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ,మహిళా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న కడారి జ్యోతి సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.పరకాల పట్టణంలో బిఆర్ఎస్ మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసి,పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
