మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మహిళ కూలీల శవాలను చూసి దిగ్బ్రాంతి
మల్లాపూర్ ఫిబ్రవరి 4 నేటి ధాత్రి
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదానికి గురై మరణించిన మహిళ వ్యవసాయ కూలీల శవాలను మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించారు ఆసుపత్రి లో శవాలను చూసిన జువ్వాడి కృష్ణారావు దిగ్భ్రాంతి కి గురయ్యారు నిన్న జరిగిన ప్రమాదంలో నలుగురుమహిళా వ్యవసాయ కూలీలు మరణించడం అత్యంత బాధాకరమని మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తామని ఈ సందర్భంగా కృష్ణారావు అన్నారు కృష్ణ రావు వెంట మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుండ్ర శ్రీనివాసరెడ్డి మాజీ జడ్పిటిసి సభ్యుడు జల పతిరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు వార్ద సురేష్ మాజీ ఎంపిటిసి సభ్యులు మరిపెళ్లి మల్లయ్య మాట్ల సోమయ్య తదితరులు ఉన్నారు.
