వేశ్యలంటూ వెర్రి వాగుళ్లు!మేధావుల ముసుగులో వెదవలు?

`నాలుగు రోజులు జర్నలిస్టులుగా పని చేస్తే మేధావులు కారు.

`సమాజాన్నే కించ పర్చే వ్యాఖ్యలు చేస్తే గొప్ప వారు కారు.

`అమరావతి దేవతల రాజధాని!

`కనిపించే తల్లి కన్నా గొప్ప దైవం విశ్వంలో ఎవరూ వుండరు.

`అమరావతి అంటే ఇది కాదు అనడానికి సిగ్గు పడాలి.

`మన కళ్ల ముందు కనిపించేదే అమరావతి అనుకోవాలి.

`అదే దేవతల రాజధానిగా భావించాలి.

`అమరావతి పరిసర ప్రాంతాలు వేశ్యల రాజధాని అన్న వాడికి శిక్ష పడాలి.

`అమరావతి ప్రాంతాన్ని అవమానించడమే!

`ముఖ్యంగా మహిళల ఆత్మాభిమానం దెబ్బతీయడే!

`రాజధాని ప్రాంతాన్ని ఈ రకంగా చిత్రీకరించడం నేరమే!

`వేశ్య చేసేది కూడా కాయకష్టమే!

`మన సమాజంలో అలాంటి పరిస్థితులపై వ్యవస్థ సిగ్గుపడాలి.

`శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో వేశ్య పన్ను అమలు చేశారు.

`వేశ్య వృత్తి తప్పే..వారు తప్పుడు మహిళలు కాదు.

`పొట్ట కూటి కోసం తప్పని పరిస్థితులలో గడిపే కాలం!

హైదరాబాద్‌,నేగిధాత్రి:

తమదే జర్నలిజం..తాము చెప్పిందే సుభాషితం అనుకునేవాళ్లు చాల మంది మోపయ్యారు. ముఖ్యంగా ఎలక్రానిక్‌ మీడియా వచ్చిన తర్వాత వారి పైత్యం మరీ ఎక్కువైంది. నోరుంది కదా? అని ఏది పడితే అది వాగకు..అన్నది తెలుసు. అయినా తాము సత్యాలే చెబుతాం…ప్రజలకు నిజాలే అందిస్తామన్నట్లు కొన్ని దుష్టపర్వాలు ఉచ్చరిస్తుంటారు. ఇలాంటి వాళ్లను సమాజం కూడా వెలివేయాలి. ఇక్కడ అసలు విషయాన్ని ముందు తెలుసుకుందా. ఈ మధ్య ఓ ఆంగ్ల దినపత్రికలో ఆరోగ్యపరమైన అంశాలను వివరించే క్రమంలో ఓ ఆర్టికల్‌ వచ్చింది. అందులో వ్యభిచారం ఎక్కువగా జరుతున్న రాష్ట్రాల క్రమాన్ని వివరించారు. దానికి లేనిపోనివి ఆపాదించి, సాక్షి టీవిలో అసందర్భ చర్చను చేపట్టారు. నిజానికి అలాంటి విషయాలను చర్చించాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎన్నో దారుణాలున్నాయి. సమస్యలున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలున్నాయి. వాటిని వెలుగులోకి తెస్తే,ప్రజలకు మేలు జరుగుతుంది. అంతే కాని వ్యభిచారం గురించి సోది మొదలు పెట్టి ఏకంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిపై నిందలు మోపడం అన్నది సరైంది కాదు. పైగా మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడం అసలే మంచిది కాదు. ప్రపంచంలో వ్యభిచారం అనేది ఎక్కడలేదు? అమెరికా లాంటి దేశాల నుంచి చాలా పేద దేశాల్లో కూడా వుంది. వేశ్యా వృత్తి రాజుల కాలం నుంచి వుంది. అదేమీ తప్పు కాదు. మన దేశంలో చట్ట పరంగా నేరం. దానిని ఏ ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు. మన సమాజంలో అనాదిగా అవలంభిస్తున్న వృత్తుల్లో వ్యభిచారం కూడా వుండేది. ఇప్పుడు మన సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఆ వృత్తిని ఎప్పుడో వదిలేశారు. కాని ఏకంగా ఏపి రాజధాని ప్రాంతాన్ని వేశ్యల రాజధాని అంటూ సీనియర్‌ జర్నలిస్టు అనే ముసుగులో వున్న కృష్ణం రాజు అనే వ్యక్తి మాట్లాడడం తప్పు. నేరం కూడా. అంతే కాకుండా సాక్షి టివీలో యంకర్‌గా పనిచేసే సీనియర్‌ జర్నలిస్టు కృష్ణం రాజును మాటలను అడ్డుకోకపోవడం, తప్పని చెప్పకపోవడంతోపాటు, సమర్ధించినట్లే వ్యవహరించడమే అసలు సమస్యకు కారణమైంది. నిజం చెప్పాలంటే ఏపిలోని అమరావతి ప్రాంతానికి ప్రత్యేకమైన విశిష్టత వుంది. అది బుద్దుడు నడయాడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి బుద్దుడు వచ్చి అక్కడ చాలా కాలం పాటు వున్నట్లు కూడా చరిత్ర చెబుతోంది. పైగా బుద్దిజం విలసిల్లిన ప్రాంతం. అంతే కాకుండా ఆ ప్రాంతాన్ని ధాన్య కటకము అనికూడా చరిత్రచెబుతోంది. తెలుగు మొట్టమొదటి రాజులైన శాతవాహనుల తొలి రాజధాని అమరావతి అయితే, రెండో రాజదాని దాన్య కటకము అని చరిత్రలో వుంది. అయితే మరో అమరావతి ప్రస్తుతం మహారాష్ట్రలో వుంది. అది శాతవాహనుల రాజదాని. తర్వాత రెండో రాజధాని అయిన ధాన్యకటకము. అది గుంటూరు జిల్లాలో వుంది. తర్వాత కాలంలో ధాన్యకటకాన్ని అమమరావతి అని పిలుస్తూ వచ్చారు. అంతే కాకుండా అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం కృష్ణా నది ఒడ్డున వుంది. అందుకే అమరావతి అనే పేరు అలా కూడా వచ్చింది. అంతటి పవిత్రమైన ప్రాంతాన్ని గురించి నోరుంది కదా? కృష్ణంరాజు వెర్రి వాగుడు వాగి ఇరుక్కుపోయాడు. అయితే తాము క్షమాపణ చెప్పాం..అర్దం చేసుకోకలేపోతే మేమేం చేయలేమంటూ మళ్లీ కొమ్మినేని శ్రీనివాస్‌ రావు మళ్లీ గిల్లాడు. దాంతో ప్రజలకు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 40 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో వుండి తాము రాసిందే వార్త అనే దుర్మార్గపు పైత్యం వారిలో నిండిపోయింది. అందుకే ఇలాంటి మాటలు వదిలేశారని చెప్పకతప్పదు. అమరావతి దేవతల రాజధాని. దానికి దేవేంద్రుడు రాజు. కాని ఇది మన రాష్ట్రంలో అమరావతి. దానికి దీనికి సంబంధం లేదంటూ నోటి దూలను ప్రదర్శించారు. దాంతో ఇరుక్కున్నారు. అయినా వేశ్యా వృత్తిని ప్రోత్సహించిన రాజుల కాలం కూడా వుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వేశ్య పన్ను కూడా విధించిన సందర్భాలున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వేమన శతకాలు. వేమన పద్యాలు తెలియని వారు ఎవరూ వుండదు. వేమన కూడా ఒక వేశ్యను ఆరాదించిన సంగతి తెలిసిందే. ఆమె పేరు మీదనే పద్యాలు కూడా రాశారు. వృత్తి తప్పుకావొచ్చు కాని వారి మనసు తప్పని ఎలా చెప్పగలం. ఒక మహిళ వేశ్యగా మారడానికి ఎవరు కారణం? మన సమజం కాదా? సమాజంలో వున్న హెచ్చు తగ్గులు కాదా? కుల వ్యవస్ధ కాదా? ఎప్పుడో దాసి అనే సినిమా వచ్చింది. రాజుల కాలంలో వేశ్యా నర్తకిలు వుండేవారు. నాడైనా, నేడైనా సమాజంలో వున్నారు. అది తప్పుకాదు. కాలే కడుపుకు తిండి దొరకాలంటే కొన్నిసార్లు తప్పు కాదు. ఏదైనా పని చేసుకొవచ్చు కదా? అని నీతులు చెప్పేవారు కూడా వున్నారు. సగటు మహిళ పది మంది మధ్య పని చేయాలంటే ఆ చుట్టూ వుండే చూపులు చేసే గాయం ఎంత ప్రమాదరకమో తెలియందా? ఇంత విద్యా, విజ్ఞానవంతమైన సమాజంలోనే నిత్యం అనేక అకృత్యాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు జరుగున్నాయి. చెప్పలేనటు వంటి దారుణాలు జరుగుతున్నాయి. మగాడి కోరికకు బలౌతున్న ఎంతో మంది అబలల జీవితాలు ఆగమౌతున్నాయి. వేశ్య వృత్తిని స్వీకరించిన వారిని సమాజం దూరం కొడుతుంది. రోడ్డు మీద కనిపిస్తే చీత్కరించుకుంటారు. రాత్రి పూట వాళ్ల దగ్గరకు సుఖానికి వెళ్తాడు. మగాడిలోనే రెండు రకాల వేశ్య దాగివున్నాడు. అలాంటి మగాడికి వేశ్య గురించి మాట్లాడే అర్హత లేదు. అయినా వేశ్య అని ముద్ర వేసి, వారిని కించపర్చే హక్కు ఎవరికీ లేదు. వారిని నీచంగా మాట్లాడే హక్కు లేదు. ఎవరి వృత్తి వారిది. వారి వృత్తిని శంకించే హక్కు ఎవరికీ లేదు. మేధావుల ముసుగులో కృష్ణం రాజు వాగడం, దాన్ని కొమ్మినేని ఆపకపోవడం రెండూ నేరాలే. గత ఐదేళ్ల కాలంలో అమరాతిని ఏ కొంచెం పట్టించుకున్నా, ఇప్పుడు ఎంతో గొప్ప రాజదానిగా అడుగులు పడేవి. అమరావతిని అభివృద్ది చేస్తే సిఎం. చంద్రబాబుకు ఎక్కడ పేరొస్తుందో అని మూడు రాజధానులంటూ నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు లేనిపోని కూతలు కూస్తున్నారు. ఆ ప్రాంత మహిళలపై అభాండాలు వేశారు. ఇది మన్నించలేంత ఘోరం. ఎట్టకేలకు కొమ్మినేని అరెస్టు చేశారు. కృష్ణం రాజును అరెస్టు చేస్తామంటున్నారు. ఏ మీడియా అయినా సరే మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడానికి ఈ సంఘటనతో భయపడాలి. అంతే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!