నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం వరంగల్ కోర్టులో జరిగాయి. వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ 2024-2025 అధ్యక్షుడుగా సీనియర్ న్యాయవాది తీగల జీవన్ గౌడ్ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా సీనియర్ న్యాయవాది ముదాసిర్ అహ్మద్ గెలుపొందారు. వరంగల్ బార్ అసోసియేషన్ లేడీ జాయింట్ సెక్రటరీగా మహిళ న్యాయవాది గోపిక రాణి ఎన్నికయ్యారు. అలాగే వరంగల్ కాశీబుగ్గకు చెందిన పెండ్యాల అనిల్ కుమార్ ఈసీ మెంబర్ గా ఎన్నికయ్యారు.