జయముఖీలో ముగిసిన డిజైనింగ్ సోలార్ సిస్టమ్ వర్క్ షాప్

మండలంలోని ముగ్ధుము పురం గ్రామంలోని జయముఖీ ఇంజనీరింగ్ అటానమస్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే ట్రైనింగ్ ప్రోగ్రాం “డిజైనింగ్ సోలార్ సిస్టమ్ వర్క్ షాప్”మంగళవారం రోజున కళాశాల ఆవరణలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం& ఐ.ఈ.ఈ.ఈ పెస్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం స్. ఏ.ఈ ఇండియా మరియు గ్రీన్ వేయిన్ ఎనర్జీ టెక్నాలజీస్ సంయుక్త ఆద్వర్యంలో విజయవంతంగా ముగిసింది ముఖ్య అతిథి కళాశాల ప్రిన్సిపాల్ వాగ్దేవి గ్రూప్స్ ప్రెసిడెంట్, ట్రెజరీ ,విభాగ అధిపథులు ఈ కార్యక్రమన్ని ప్రారంభం చేశారు.

ముఖ్య అతిధిగా పాల్గొన్న పురుషోత్తం చారీ, గ్రీన్ వేయిన్ ఎనర్జీ టెక్నాలజీస్ మానేజర్ మాట్లాడుతూ రేనేవాబుల్ విద్యుత్ ఉత్పత్తి, నియంత్రణ పై ప్రయోగాత్మకంగా విద్యార్థులచే అవగాహన కల్పించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. యం. లోకనదరావు మాట్లాడుతూ విద్యార్థులం దరూ రెండు రోజులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు అభినం దించారు.వాగ్దేవి కళాశాలల ప్రెసిడెంట్ శ్రీ సీ.హెచ్ నరసింహ రెడ్డి మరియు ట్రెజరీ జీ.శంకర్ రెడ్డి ,ఈ శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న వారికి సర్టిఫికేట్ ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం లోకనాధ్ రావు ,వాగ్దేవి కళాశాలల ప్రెసిడెంట్ శ్రీ సీ.హెచ్ నరసింహ రెడ్డి , ట్రెజరీ శ్రీ.జీ.శంకర్ రెడ్డి ,డీన్ అకడమిక్ హమీద్ పాషా.,వైస్ ప్రిన్సిపాల్ డా.పీ.శ్రీనివాస రావు, ఈ.ఈ.ఈ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ రజనీ కుమార్, మెకానికల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ యం. జవహర్ మరియు ప్రోగ్రాం కో ఆర్డనేటర్స్ కే. శ్రీదేవి మరియు సీ.హెచ్ జీవన్ రెడ్డి, ప్రొఫెసర్ రంజిత్ ,కళాశాల వివిధ విభాగాల అధిపతులు మరియు అధ్యాపకులు , దేశంలోని వివిధ రాష్ట్రాల కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *