హిందువులకు అక్రమ కేసులు పెట్టడం దురదృష్టకరం

మండల బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్

నిజాంపేట: నేటి ధాత్రి

గోవుల రక్షణకు చేసిన ప్రయత్నంలో హిందువులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం దురదృష్టకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మండల బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం రోజున అరెస్టుకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో వ్యాపార వాణిజ్య సంస్థలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ ఘటన జరిగిన తీరుపట్ల పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, ఘటనకు కారణమైన వారిని వదిలేసి ఫిర్యాదు చేసిన గో సంరక్షణకులను అదుపులోకి తీసుకొని జైలుకు పంపడం ఎంతవరకు సమంజ సమన్నారు. అనంతరం బందుకు సంహరించిన వ్యాపారస్తులకు ధన్యవాదములు చెప్పారు. హిందువులు పూజించే గోమాత ను వదించకుండా ప్రతి ఒక్కరు గోవద నిషేదించాలని అన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు ఆకుల రమేష్, నరేష్ మహంకాళి, అముధ రాజు, సిద్దరాం రెడ్డి, పంజా బాబు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!