అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.

Yoga Day. Yoga Day.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

 

నడికూడ నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు అందరు కలిసి యోగాసనాలు వేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ శ్వాస మీద,ధ్యాస,మనకై మనం చేసే అన్వేషణే యోగాని,అదేవిధంగా తనువును,మనసును, ఆత్మను ఏకం చేసే ఒకే ఒక సాధనం యోగాని, అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని,ఈ యోగా దినోత్సవాన్ని 2014 సెప్టెంబర్ 27 న భారత ప్రధాన నరేంద్ర మోడీ ఐక్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపు కోవడం గురించి ప్రతిపాదన చేశారని,ఈ ప్రతిపాదనకు 193 ఐక్యరాజ్యసమితి ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారని,భద్రతా కమిషన్ లో శాశ్వత సభ్యులుగా ఉన్న భారతదేశం,అమెరికా, ఇంగ్లాండ్,చైనా,ఫ్రాన్స్,రష్యా దేశాలు కూడా ఈ తీర్మానానికి సహప్రతినిధులు అని,విస్తృతమైన చర్చల అనంతరం డిసెంబర్ 2014లో ఆమోదించబడి 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు.యోగా జూన్ 21న జరుపుకోవడానికి గల కారణం జూన్ 21న ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుందని ఎక్కువ ప్రగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోడీ సూచించారని అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు
తెలంగాణ ఉద్యమ పితామహుడు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజకుమార్, మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య,విద్యార్థిని,విద్యార్థులు మరియు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!