అంతర్జాతీయ బాలల దినోత్సవం

నడికూడ,నేటి ధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం రోజున అంతర్జాతీయ బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ నవంబర్ 20 1989న బాలల హక్కులపై కన్వెన్షన్ ను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిందని ఇట్టి ప్రత్యేక రోజును అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం గా జరుపుకుంటున్నారని అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికను భారతదేశం డిసెంబర్ 11, 1992 నాడు అంగీకరించిందని అన్నారు.తదనుగుణంగా పిల్లల హక్కుల రక్షణకై భారతదేశం బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చట్టం(సిపిసిర్) జనవరి 20,2006 నాడు అమల్లోకి తెచ్చిందని, బాలలందరూ వారి యొక్క హక్కులు సంపూర్ణంగా పొందేలా కృషి చేస్తామని, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ చేయాలని, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచన చేసిందని అన్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు, బాలల హక్కుల ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నిగ్గుల శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మి, నందిపాటి సంధ్యా, విద్యా వాలంటీర్లు బాబురావు పర్శవేని జ్యోతి, ఐఆర్పి రమేష్ ఆయాలు అరుణ,సుశీల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *