Leaders Attend Indiramma Housing Housewarming
ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న
◆-: రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
◆-: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ :పట్టణంలోని 12 వార్డు(గడి)కి చెందిన రవి ఆహ్వానం మేరకు శుక్రవారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొన్నారు.వారికి ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుడు రవి ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలతో పాటు పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరుతుందని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,12వార్డు ఇంచార్జి ఇనాయత్,కౌన్సిలర్ అరుణ్ కుమార్,14వార్డు ఇంచార్జి రాజ్ కుమార్,నరేష్ బబ్లూ,నర్సింహా యాదవ్,మోహీన్,పవన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
