మోకాళ్లపై కూర్చొని నిరసన
భూపాలపల్లి నేటిధాత్రి
శాసనసభ ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కుమారస్వామి, జిల్లా బాద్యులు రామయ్య, పి ఆర్ సి రాష్ట్ర అధ్యక్షుడు పెండ్యాల దేవరాజు మద్దతు తెలిపారు. న్యాయమైన సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా ఒప్పంద ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్ష శనివారం 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కంకల రాజయ్య, జిల్లాఅధ్యక్షులు చాంద్ పాషా, ప్రధాన కార్యదర్శి తోకల వేణు మాట్లాడుతూ… సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజే
షన్ చేయాలని, ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజులు వేతనం తో కూడిన ప్రసూతి సె లవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్. మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మ హిళా ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవు లు ప్రభుత్వం వెంటనే ప్రకటించి వారి జీవితా లలో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేస్తున్నా మన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చాలీచాలని వేతనంతో అత్యంత దుర్భర పరిస్థితులలో జీవనం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ చే యాలని, లేనిపక్షంలో పే స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాద్యులు మహేందర్ రెడ్డి, చంద్రకళ, నరేష్, రాజు, తిరుపతి, సుదర్శన్, కనకలక్ష్మి, సతీష్, రాజు, కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.