చలివేంద్రం ప్రారంభోత్సవం
మాజీ కౌన్సిలర్ కొమురెల్లి అనిత సుధాకర్ రెడ్డి
నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
నాగారం మున్సిపాలిటీ ఎస్వి నగర్ ప్రధాన రహదారి రోడ్ నెంబర్ – 1 వద్ద శ్రీ సాయి గ్రాండ్ మినీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అధినేత శ్రీ ఎనిశెట్టి చంద్రమౌళి గుప్తా గారు ఏర్పాటు చేసిన చలివేంద్రం (వాటర్ ఫ్రీజర్)ను స్థానిక మాజీ కౌన్సిలర్ కోమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించినారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి వేసవి కాలంలో క్రమం తప్పకుండ బాటసారుల దాహర్తిని దృష్టిలో పెట్టుకొని కుల మతాలకు అతీతంగా చల్లని తాగునీటిని అందించాలని చల్లని ఫ్రీజ్ వాటర్ ఏర్పాటు చేసిన ఎనిశెట్టి చంద్రమౌళి గుప్తా గారి సేవలు ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు కార్యక్రమంలో కోమిరెల్లి సుధాకర్ రెడ్డి,మోకు జగన్ మోహన్ రెడ్డి,కొత్త గోపాల్ రెడ్డి,మామిడి నవీన్ రెడ్డి,పైళ్ల మల్లా రెడ్డి,సారా బాల్ రాజ్, కోమిరెల్లి వీరారెడ్డి,ఉచిడి అంజన్ రెడ్డి,ఏనుగు రమణ రెడ్డి, పండగ నర్సింహా,మర్రి లక్ష్మా రెడ్డి,మోడల నర్సింహా,ఈశ్వర్,గుమ్మడి వేణు,భాష తదితరులు పాల్గొన్నారు.