వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

రామయంపేట (మెదక్)నేటిధాత్రి.

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రామయంపేట మండలం డి .ధర్మారం లో వరి కొనుగోలు కేంద్రాన్ని సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీ పండిత్ గారు ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ నారాయణ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 16394 ఎకరాలలో 31107 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మండల వ్యాప్తంగా ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 12 , ఐకెపి కేంద్రాల ద్వారా 2 కేంద్రాల ద్వారా వరి కొనుగోలు చేయడం జరుగుతుందని, కనీస నాణ్యత ప్రమాణాలు పాటించినట్లయితే కనీస మద్దతు ధర అందే అవకాశం ఉంది. ఎవరైనా రైతుల యొక్క వివరాలు ఆన్లైన్ విధానంలో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడిన కౌలు రైతులకు సంబంధించి సమస్యల నిమిత్తం వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించినట్లైతే సమస్య పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం సీఈవో నర్సింలు, సెక్రెటరీ దుర్గారెడ్డి పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!