ఐకెపి, రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభం
నిజాంపేట: నేటి ధాత్రి
ఐకెపి, రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఐకెపి, రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. సీరియల్ పద్ధతిలో కొనుగోలు జరపడం జరుగుతుందని పేర్కొన్నారు. తేమశాతం 14 ఉండేలా చూడాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు బురాని మంగమ్మ, వాణి, రజిత, కావేరి, రైతులు చాకలి రవి, అందే స్వామి, మ్యాదరి ప్రభాకర్, పట్ల స్వామి, బోయినీ బాలరాజు, రమేష్ ఉన్నారు.
