Silence Day Enforced, Non-Voters Must Leave Area
అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ కే ఓటేయాలి : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి
* అలియాబాద్ మున్సిపల్ లో ఎన్నికల ప్రచారం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున సోమవారం మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఇంటి ఇంటి కి వెళ్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించలని ఓటర్ లను కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు బండి లక్ష్మీ రాంరెడ్డి, తూము యమున శ్యామ్, తంటం నర్సింహా, సగ్గు శ్రీనివాస్ యాదవ్, కుమార్ యాదవ్, ముద్దం మధుసూదన్ రెడ్డి, బోయిన రాజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
