గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపును ఎవ్వరూ ఆపలేరు
ఇంటింటి ప్రచారానికి జన నీరాజనం
-టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 4
కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను నమ్మితే మోసపోతారనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని బిఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. శనివారం ఆమె మొగుళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని మమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపును ఎవరు ఆపలేరని, భూపాలపల్లి ఎమ్మెల్యేగా గండ్ర వెంకట రమణారెడ్డినే ఎమ్మెల్యేగా గెలవబోతున్నారన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా మొగులపల్లి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి ఎక్కడికి వెళ్లిన జన నీరాజనం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. బిఆర్ఆర్ కార్యకర్తలంతా గండ్ర వెంకట రమణారెడ్డి గెలుపు కొరకు ఉత్సాహంతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, ఎంపీపీ యార సుజాత సంజీవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు, జడ్పిటిసి జోరుక సదయ్య, మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మన్న తదితరులు పాల్గొన్నారు.