మావిగన్‌పై అంత ప్రేముంటే.. సీఆర్డీఏను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు జగన్: పట్టాభి ప్రశ్న…

మావిగన్‌పై అంత ప్రేముంటే.. సీఆర్డీఏను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు జగన్: పట్టాభి ప్రశ్న

మావిగన్ పేరు ప్రతిపాదనతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కామెడీ పీస్‌గా మారిపోయారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వ్యంగంగా అన్నారు.

అమరావతి, ఏప్రిల్ 05: మావిగన్ పేరు ప్రతిపాదనతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కామెడీ పీస్‌గా మారిపోయారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వ్యంగంగా అన్నారు. ఆదివారం అమరావతిలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఏపీ సీఆర్డీఏ మ్యాప్ చూస్తే.. సీఎం చంద్రబాబు నాయుడి విజన్ ఏమిటో జగన్ రెడ్డికి అర్థమవుతుందన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి అనుకూలంగా ఉంటే.. వైఎస్ జగన్ ఒక్కరే వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. అమరావతిపై ఉన్న కడుపు మంటతోనే జగన్ మావిగన్ పేరు ప్రతిపాదన చేశారని విమర్శించారు.అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్

కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ

డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..

బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

మైదాపిండికి ప్రత్యామ్నాయం

షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు

చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌‌ను రక్ష

ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్

పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్

కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ

డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..

బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

మైదాపిండికి ప్రత్యామ్నాయం

షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు

చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌‌ను రక్ష

ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్

పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

కేంద్ర ప్రభుత్వం కోరిక మేరకు అమరావతి తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించామని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో రూపొందించిన చట్టాలు.. రాష్ట్రాలకు మార్చే హక్కు లేదని వైఎస్ జగన్‌కు ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు. బిల్లు, తీర్మానానికి గల వ్యత్యాసాన్ని తెలుసుకోవాలంటూ వైఎస్ జగన్‌కు ఆయన సూచించారు. జగన్ కుట్రలను గ్రహించాలని రాష్ట్ర ప్రజలకు ఈ సందర్బంగా పట్టాభిరామ్ స్పష్టం చేశారు.

అభివృద్ధి పాఠాలు జగన్ దగ్గర నేర్చుకోవాల్సిన పని కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. 2014లోనే కృష్ణా, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారని వివరించారు. 2015 సెప్టెంబర్ 22వ తేదీన అందుకు సంబంధించిన జీవో నెం.207 ద్వారా సీఆర్డీఏ చట్టం రూపొందించి ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచించారని గుర్తు చేశారు.

11 సంవత్సరాలు క్రితమే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల అభివృద్ధికి సీఆర్డీఏ చట్టం తీసుకొచ్చామన్నారు. ఏపీ సీఆర్డీఏ పరిధి మచిలీపట్నం సమీపంలోని మోపిదేవి, ఘంటశాల వరకు… ఇటు గుంటూరు దాటి యడ్లపాడు వరకు ఉందన్నారు. ఏపీ సీఆర్డీఏ మ్యాప్ చూస్తే.. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో జగన్ రెడ్డికి అర్థమవుతుంది. మావిగన్ ప్రతిపాదనపై జగన్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే.. 2020లో సీఆర్డీఏ యాక్ట్ ఎందుకు రద్దు చేయాలనుకున్నారంటూ ఈ సందర్భంగా వైసీపీ అధినేతను పట్టాభి సూటిగా ప్రశ్నించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version