ఏపీ తీర ప్రాంతంలో చేపల అక్రమ వేట.. తమిళనాడు బోట్లపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం..

ఏపీ తీర ప్రాంతంలో చేపల అక్రమ వేట.. తమిళనాడు బోట్లపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం..

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తమిళనాడు బోట్లు తిరగడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయినట్లు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీ తీర ప్రాంతంలోని బంగాళాఖాతంలోకి ఆ రాష్ట్ర బోట్లు అక్రమంగా చొరబడి చేపల వేట చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తమిళనాడు బోట్లు తిరగడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయినట్లు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీ తీర ప్రాంతంలోని బంగాళాఖాతంలోకి ఆ రాష్ట్ర బోట్లు అక్రమంగా చొరబడి చేపల వేట చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తమిళనాడు బోట్లను ఎదుర్కొనేందుకు టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దింపినట్లు మంత్రి వెల్లడించారు. మన రాష్ట్ర మత్స్య సంపదను తమిళనాడు మత్స్యకారులు కొల్లగొడుతున్నారని.. అందుకే ఆధునిక స్పీడ్ బోట్ల సహాయంతో టాస్క్ ఫోర్స్ గస్తీ కాస్తోందని పేర్కొన్నారు.

 

LATEST

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్

కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ

డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..

బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

మైదాపిండికి ప్రత్యామ్నాయం

షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు

చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌‌ను రక్ష

ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్

పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్

కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ

డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..

బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

మైదాపిండికి ప్రత్యామ్నాయం

షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు

చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌‌ను రక్ష

ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్

పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

ఏపీ తీరంలో తమిళనాడు, పాండిచ్చేరి బోట్ల ఆగడాలు, అక్రమ చేపల వేటని అస్సలు ఊపేక్షించవద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారని మెరైన్ ఐజీ గోపీనాథ్ తెలిపారు. దీంతో తీరంలో 24గంటలూ గస్తీ ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 4 బోట్లలో టాస్క్ ఫోర్స్ బృందాలు ముమ్మర గస్తీ కాస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో 4 బోట్లు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఐజీ వెల్లడించారు. ఇటీవల కాలంలో మూడు ఇతర రాష్ట్రాల బోట్లని టాస్క్ ఫోర్స్ బృందాలు పట్టుకున్నట్లు తెలిపారు. జువ్వలదిన్నె హార్బర్‌లో మెరైన్ ఐజీ గోపీనాథ్, డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, గొట్టిపాటి చెంచుబాబు, శ్రీధర్, శ్రీనివాసులు, బాలిరెడ్డి పర్యటించారు. సముద్రంలో సుమారు 30 నాటికల్ మైళ్లు బోటులో వెళ్లి పరిశీలించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version