రోడ్లపై విగ్రహ తయారీ కేంద్రాలు….!!!

Construction Construction

రోడ్లపై విగ్రహ తయారీ కేంద్రాలు….!!!

నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్డుల నిర్మాణం

చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు, గ్రానైట్ పెర్మిషన్ లేకుండానే వ్యాపారం

లక్షల్లో వ్యాపారం, పట్టించుకొని ఆదాయపు శాఖ అధికారులు?

ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న విగ్రహ తయారీ పరిశ్రమలు

పట్టించుకోని మున్సిపల్ అధికారులు., తడకల షెడ్డుకు విద్యుత్ కనెక్షన్ లు?

Construction
Construction

 

మామూళ్ల మత్తులో మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ అధికారులు?

దుమ్ము దూలితో వాహనదారులకు ఇబ్బందులు

జీఎస్టీ లేదు, బిల్లు బుక్కులు లేవు, రోజుకు లక్షల రూపాయల వ్యాపారం

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న విగ్రహ వ్యాపారాలు.

 

Construction
Construction

 

 

ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉండాల్సిన పరిశ్రమ కేంద్రాలు, రోడ్ల మీద తడకల షెడ్డు వేసి అక్రమ వ్యాపారం

చిన్న స్థాయి, పై స్థాయి ఉన్నతాధికారుల వరకు అందరికీ ముడుపులు?

వరంగల్, ములుగు రోడ్డు, ఆరేపల్లి, నేటిధాత్రి

 

 

 

ప్రభుత్వ జాగా, కెనాల్ కాలువకు ఆనుకొని దర్జాగా తడకల (రేకుల) షెడ్డు వేసి, అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకుని, ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విగ్రహాల తయారీ నడుపుతున్న నిర్వాహకులు. వివరాల్లోకి వెళితే వరంగల్ ములుగు రోడ్డు నుండి ఆరేపల్లికి వెళ్ళే దారిలో, పెద్దమ్మగడ్డ కెనాల్ కాలువ పక్కన, అలాగే ఆరేపల్లి వ్యవసాయ క్షేత్రం ముందు ఉన్న విగ్రహ తయారీ నిర్మాణ కేంద్రాలు అక్రమంగా తడుకలు, రేకుల షెడ్డులు వేసి, ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నడుపుతున్న తీరు.

Construction
Construction

 

ప్రధాన రహదారిపై వ్యాపారానికి ఎవరు పెర్మిషన్ ఇచ్చారు? విద్యుత్ కనెక్షన్ ఎలా వచ్చింది? రోజు విగ్రహాలు తయారీ వలన దుమ్ము ధూళి వెలువడుతూ వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్న పట్టించుకొని మున్సిపల్ అధికారులు. ఇక్కడ తయారు చేసిన విగ్రహాలను వేల రూపాయలకు అమ్ముతూ ఎలాంటి జీఎస్టీ కానీ, బిల్లు బుక్కులు కూడా లేకుండా అమ్ముతున్న నిర్వాహకులు. ట్రేడ్ లైసెన్స్ కూడా లేకుండా, అక్రమంగా నడుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న విగ్రహ తయారీ కేంద్రాలను సీజ్ చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా రోడ్డు మీద పట్ట పగలు అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజల విన్నపం.

Construction
Construction

 

ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో ఉండాల్సిన తయారీ పరిశ్రమ కేంద్రాలు, ప్రధాన రహదారులపై ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం కొనసాగించడం, తనిఖీలు చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు, గ్రానైట్ పెర్మిషన్ లేకుండానే వ్యాపారం? లక్షల్లో వ్యాపారం, పట్టించుకొని ఆదాయపు శాఖ అధికారులు? విజిలెన్స్ అధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాలి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తయారి కేంద్రాలను వేరే చోటికి తరలించాలని ప్రజలు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!