భార్య కనిపించడం లేదని భర్త ఫిర్యాదు
జహీరాబాద్ నేటి ధాత్రి:
న భార్య ఉష కనిపించడం లేదని కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన కృష్ణయ్య శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 27న మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఆమె.. సాయంత్రానికి కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంధువులు, గ్రామస్థుల సహాయంతో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ వెల్లడించారు.