Husband Files Complaint Over Missing Wife
భార్య కనిపించడం లేదని భర్త పిర్యాదు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా కోహిర్ పోలీస్ స్టేషన్లో తన భార్య కనిపించడం లేదని భర్త పిర్యాదు పై కేసు నమోదు అయినట్లు కోహిర్ ఎస్సై నరేష్ పత్రిక ప్రకటనలో తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటపూర్ గ్రామానికి చెందిన కవంపల్లి రాచయ్య తండ్రి చంద్రయ్య అనె వ్యక్తి భార్య అయిన కవంపల్లి కృష్ణవేణి వయస్సు 30 సంవత్సరలు మహిళా వెంకటాపూర్ గ్రామం నుండి గత నెల 25వ తేదిన ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయిందని తన భార్య గురించి బంధువులు చుట్టుపక్కల, స్నేహితుల వద్ద ఎంత వెతికినా ఆమె జాడ లేదని ఆమె ఆచూకీ కొరకు బుధవారం స్టేషన్ వచ్చి పిర్యాదు చేసాడని అ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
