నర్సంపేట మునిసిపల్ కమిషనర్,సీఐ లకు సన్మానం.

CI Raghupathi Reddy. CI Raghupathi Reddy.

నర్సంపేట మునిసిపల్ కమిషనర్,సీఐ లకు సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

మునిసిపాలిటీలో కమిషనర్ గా పదోన్నతి పొందిన నాగరాజు,పట్టణ సీఐ రఘుపతి రెడ్డిలకు బీసీ సంఘం ఆధ్వర్యంలో శనివారం శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానం చేశారు. నర్సంపేట మున్సిపాలిటిలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు మున్సిపాలిటీ కమీషనర్ గా ఇటీవల పదోన్నతి పొందడంతో తన కార్యాలయంలో, పోలీస్ స్టేషన్ లో నూతనంగా విధుల్లో చేరిన టౌన్ సీఐ రఘపతి రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు ఘనంగా సన్మానించారు.

 CI Raghupathi Reddy.
CI Raghupathi Reddy.

 

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, మోకుదెబ్బ జిల్లా గౌరవ అధ్యక్షులు సొల్తీ సారయ్య గౌడ్, మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్,బీసీ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి సాంబరాతి మల్లేశం, పట్టణ అధ్యక్షులు గండు రవి గౌడ్, ఉపాధ్యక్షులు చీర వెంకట్ నారాయణ, యువజన నాయకులు బైరి నాగరాజు,రామగోని శ్రీనివాస్ గౌడ్,జామళాపురం అశోక్,పుల్లూరి కుమారస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!