మహాప్రస్థానంలో పని చేస్ కార్మికులుకు సన్మానం
శేరిలింగంపల్లి,నేటి ధాత్రి :-
కార్మికుల దినోత్సవం సందర్బంగా రాయదుర్గం లోని వైకుంఠ మహా ప్రస్థానం లో పనిచేసేవారందరికీ శాలువాతో సత్కరించిన శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కార్మికులు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహా ప్రస్థానంలో పనిచేసేవారందరికీ బహుమతులను మరియు స్వీట్ బాక్స్ లను అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ “ప్రతి మనిషి ఆఖరి మజిలీ చావు, అట్టి ఆఖరి గమ్యంలో మీరంతా అందించే సేవలు ఆదర్శప్రాయం అని, అతి ముఖ్యంగా కరోనా సమయం లో మహా ప్రస్థానం సిబ్బంది అందించిన సేవలను ఎప్పటికి మర్చిపోలేమనీ కొనియాడారు.

ఒక మనిషి చనిపోతే సొంత కుటుంబికులే రాలేని రోజుల్లో మీరే అన్ని అయ్యి అంత్యక్రియలు చేయడం ఎంతో ఆదర్శం. మీరు అందించే సేవలకు మేము మా తృప్తి కొరకు అందిస్తున్న ఈ చిన్న కానుక”.భవిష్యత్తులో ఏవరికి ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహాప్రస్థానం మేనేజర్ రాజ్ కుమార్, మహా ప్రస్థానం సిబ్బంది మరియు నాయకులు అంజమ్మ, దారుగుపల్లి నరేష్, రమేష్ గౌడ్, శామ్లెట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.