పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్ఎం రాజ్….
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మీర్జాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను కాంప్లెక్స్ హెచ్ఎం రాజ్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తరగతి గదులు, విద్యార్థుల చదువుతున్న తీరు, రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెను ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ తనిఖీలో సీఆర్పీ రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
