డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్
మరిపెడ నేటి ధాత్రి.
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఈ నెల
28 మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని వంద పడకల హాస్పటల్ శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు రాక సందర్భంగా సభకు స్థల పరిశీలన చేస్తున్న ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలిసి హాస్పిటల్ ఆవరణంలోనే ఉన్న స్థలమును స్థానిక వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి పర్యవేక్షించడం జరిగింది 28న జరిగే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ అరుణ రాంబాబు,జెడ్పిటిసి శారదా రవీందర్, క్లాస్ వన్ కాంట్రాక్టర్ రామ్ మడుగు అచ్యుతరావు, నా రెడ్డి సుదర్శన్ రెడ్డి, గడ్డం వెంకన్న, స్థానిక కౌన్సిలర్లు, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.