శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ అంగరంగ వైభవంగా నిర్వహించారు అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి గణపతి పూజ విశ్వక్సేన ఆరాధన రక్షాబంధన పుణ్యా వచనం నిర్వహించి వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించినారు అంతకు ముందు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు స్వామివారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాల మధ్య తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు లెక్కల లక్ష్మీ జలంధర్ రెడ్డి దంపతులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమంలో జిన్నా ప్రతాప్ రెడ్డి కృపాకర్ రెడ్డి గట్ల భగవాన్ రెడ్డి లెక్కల మదన్మోహన్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి గిద్దమారి సురేష్ నాగరాజు విద్యాసాగర్ రాము చంద్రమౌళి నవీను అబ్బు రాజు కృష్ణారెడ్డి దేవరాజు సుమన్ వెంకటయ్య సమ్మిరెడ్డి మురళి రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు