*ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
చిత్తూరు(నేటిధాత్రి:
నిత్య కృషీవలుడు, నవ్యాంధ్ర సాధనలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కేక్ కట్ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రబాబు దూరదృష్టి, ప్రజల సంక్షేమం కోసం ఆయన పడే తపన అభినందనీయమని, ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి మరింత సేవలందించాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టిటిడి నాయకులు రాజశేఖర్ నాయుడు,
సోమశేఖర్ నాయుడు వాసు నాయుడు, గందమనేని నరేష్, బిజేపి చిన్నగొట్టిగల్లు మండలాధ్యక్షులు దండు కిషోర్ కుమార్ సింగిల్ విండో చైర్మన్ మత్తుం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
