ఎన్నికల వేళ రైతుకన్నుల్లో ఆనందం

పొలాలల్లో వడ్ల కుప్పలు
. *ఐకెపి సెంటర్లు ప్రారంభం, మిగతావి కూడా ప్రారంభించాలి శాయంపేట నేటిధాత్రి

శాయంపేట మండలం మైలారం గ్రామంలో రైతుల ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలి రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేపడుతుంది. అదేవిధంగా వానకాలం సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పంట కోతలు జరుగుతున్న ప్రాంతంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు అధికంగా ఏర్పాటు చేసి వడ్ల కొనుగోలు చేయాలి.రైతులకు న్యాయం జరిగేటట్టు చూసుకోవాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో చివరి వరకు రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామంలోని రైతులందరూ సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *