హామి మేరకు రూ. 12 వేలు వెంటనే ఇవ్వాలి

బిఆర్ఎస్ మండల పార్టీ డిమాండ్.

నర్సంపేట,నేటిధాత్రి :

నిరుపేదలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు వెంటనే ఇవ్వాలని బిఆర్ఎస్ మండల కమిటీ డిమాండ్ చేసింది.మండల పార్టీ ముఖ్య నాయకుల సమావేశం రాజపల్లి గ్రామంలో నిర్వహించారు.ఈ మేరకు నర్సంపేట రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ నిరుపేదకు సంవత్సరానికి 12 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరం పూర్తి అయ్యిన కూడా 12 వేలు ఇవ్వకుండా నిరుపేదలను మోసం చేసిందన్నారు.ఈ నెల 28 నుండి మొదటి విడిత 6 వేలు ఇస్తాం.రెండో విడతలో మరో 6 వేలు ఇస్తాం అని ఉప ముఖ్యమంత్రి చెప్పారన్నారు.నేడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. పేర్కొన్నారు.మరల ప్రభుత్వం మాటమార్చి ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పని పూర్తి చేసిన వారికే ఈపధకం ఇస్తామని మాట మార్చుతుందని విమర్శించారు.ప్రభుత్వం వెంటనే గ్రామ సభల ద్వార నిరుపేదలను ఎంపిక చేసి ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు ఇవ్వాలని డిమాండు చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరములు,మోతే జై పాల్ రెడ్డి, కొమల్ల గోపాల్ రెడ్డి,మోతే పద్మనాభ రెడ్డి,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మంచిక నర్సయ్య,మోటురి రవి,కోడారి రవి,భూక్యా వీరన్న,కడారి కుమారస్వామి,జర్పుల వీరన్న,కందుల రాజీ రెడ్డి తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!